జాబిల్లి కక్ష్యలోకి దూసుకెళ్తున్న చందయ్యన్-2
చంద్రయాన్-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటి వరకు భూ కక్ష్యలో ఉన్న చంద్రయాన్-2 భూ కక్ష్యను వీడి జాబిల్లి కక్ష్య వైపు విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ మేరకు కక్ష్య పెంచే ప్రయోగాన్ని బుధవార తెల్లవారు జమునా 2.21 గంటలకు విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారు. వ్యోమ నౌకలోని ద్రవ ఇంధనాన్ని 1203 సేకన్లు మండించి కక్ష్య పెంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదు సార్లు కక్ష్య పెంచే ప్రక్రియను చేస్తే ఐదు వియాయవంతం అయ్యాయని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం చందయాన్-2 జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గంలో పయనిస్తోంది. ఈ నెల 20న చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. దాని కోసం మరోసారి ద్రవ ఇంజిన్ను మండించాల్సి ఉంటుందన్నారు. చంద్రయాన్-2 సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే.