మిథాలీకి రూ.కోటి, 600 గజాల స్థలం
మహిళల ప్రపంచకప్లో భారత్ను ఫైనల్కు చేర్చడంతోపాటు..వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్వుమన్గా రికార్డు నెలకొల్పిన టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనమైన ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆమెకు ప్రభుత్వం తరపున రూ.కోటి నజరానాతోపాటు ప్రోత్సాహకంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్టు చెప్పారు. కోచ్ మూర్తికి కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు పేర్కొన్నారు.
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మిథాలీరాజ్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మిథాలీరాజ్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్తోపాటు కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తిని.. సీఎం శాలువాకప్పి సన్మానించారు.