ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. మలూకు దీవుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ పలు ప్రాంతాల్లో బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. మలూకు ప్రావిన్సులోని అంబన్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ ప్రాంతంలో గతంలోనూ అనేకసార్లు బలమైన ప్రకంపనలు వచ్చాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఇండోనేషియా ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. గత ఏడాది సులవేశి దీవుల్లో సుమారు 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ భూకంపంలో సుమారు 4300 మంది చనిపోయారు. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపం వల్ల భారీ సునామీ మహా విధ్వంసం సృష్టించిన విషయం కూడా తెలిసిందే.