అక్షర జ్ఞానం కోసం ‘ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌’

హైదరాబాద్‌: తెలంగాణను వందశాతం అక్షర్యాత గల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఎంతో మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రకటించిన ‘ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌’ నినాదంతో తెలంగాణలో విద్యాశాతం పెరుగుతుందన్నారు. ప్రతిచదువుకున్న యువతీ యువకులు కనీసం మరొకరికి రాయడం, చదవడం నేర్పిస్తే ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేరినట్టేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి ఉండకూడదన్నదే సీఎం లక్ష్యమని అన్నారు, సీఎం కేసీఆర్‌ ఆదేశంతో విద్యారంగంలో సమూల మార్పులు రావడం ఖాయమన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యను పటిష్టంచేయడంతో పాటు, చదువురాని వారికి లక్షరజ్ఞానం కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావశాలు కూడా మెరుగుపడాలంటే చదువు తప్పని సరి అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *