భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి గగన్ యన్
భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ గగన్ యన్. ఈ ప్రయోగం ద్వారా ఈ సారి ఇస్రో 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్ అనుభవం ఉన్న టెస్ట్ ఫైలట్లను వ్యోమగాములను పంపాలని భావిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ స్థాయిలో మహిళలు లేకపోవడంతో గగన్ యన్ ప్రయోగంలో మహిళలకు అవకాశం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. గత ఏడాది స్వతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడి గగన్ యన్ ప్రకటన చేసిన్ విషయం తెలిసిందే. ఎంపిక చేసిన వ్యోమగాములకు మొదట భారత్ లో ఆ తర్వాత రష్యాలో శిక్షణ ఇస్తారు. గగన్ యన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపితే మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.