కేసీఆర్.. తెలివైన ఎత్తుగడ

తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో.. మిర్చి రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేశారు. వారికి విపక్షాల అండదండలున్నాయన్న ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ నేతలు.. మంత్రులుకూడా.. ఈ విషయంపై.. అపోజిషన్ లీడర్లను కడిగిపారేశారు. అంతలోనే.. విషయం రైతులది కాబట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త తెలివైన ఎత్తుగడ వేశారు.

ఎవరైతే.. తనపై విమర్శలు చేశారో.. వారినే తన దగ్గరికి రప్పించుకుని.. పూర్తి భరోసా ఇచ్చేశారు. ఆందోళన జరిగిన ఖమ్మం నుంచే.. రైతులను తన క్యాంప్ ఆఫీస్ లోని ప్రగతి భవన్ కు రప్పించారు. ప్రభుత్వ పరంగా రైతులకు ఏం  చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారో చెప్పి.. వాళ్ల నోళ్లకు తాళం వేసే ప్రయత్నాన్ని స్వయంగా సక్సెస్ చేశారు.

అవసరమైతే.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా ఇస్తామని.. అది కూడా వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తామని కేసీఆర్ ఖమ్మం జిల్లా రైతులకు హామీ ఇచ్చారు. మద్దతు ధర విషయంలో.. 500 కోట్ల రూపాయల భారీ మొత్తంతో నిధులు ఏర్పాటు చేస్తామని.. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు. ఇలా.. ఆందోళన జరిగిన ఖమ్మం రైతులనే.. తన హామీలతో.. మైమరపించి.. పంపేశారు.

దీంతో.. విపక్షాలను దీటుగా ఎదుర్కోవడంలో.. కేసీఆర్ మరోసారి తన రాజకీయ చతురత చూపించుకున్నారని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *