అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోడ పెచ్చులూడి యువతి మృతి
హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఓ మహిళపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఆ మహిళ మెట్రో స్టేషన్ కిందకు చేరింది. ఇంతలోనే మెట్రో స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఆమెపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆ సమయంలో పిల్లర్పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు సందర్శించారు.