అమ్మ కోసం…ప్రధాని నరేంద్రమోడీకి లేఖ

కోల్ కత్తాకు చెందిన ఓ అమ్మాయి ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసింది. ఆసుపత్రిలో ఉన్న తన అమ్మను రక్షించాలంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. మా అమ్మ ఐసీయూ లో ఉందని కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉందని లేఖలో పేర్కొంది. ‘‘ప్రధాన్ మంత్రిజీ, మా అమ్మ ఐసీయూలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉంది. మాకు ఎంత తిరిగినా నగదు దొరకడం లేదు. ఇప్పటివరకు మేము దాచిపెట్టిన సొమ్మూ అమ్మ చికిత్సకు సరిపోవడం లేదు. బ్యాంకులో కూడా నగదు కోసం మేము అప్లయ్ చేసుకున్నాం. కానీ నగదు జారీకావడానికి 20 నుంచి 30 రోజులు సమయం పడుతుందని బ్యాంకు వారు చెప్పారు. మాకున్న ఒక్కానొక్క దుకాణాన్ని అమ్మకానికి పెట్టాం. కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‑తో ఎవరూ ఆ షాపును కొనడానికి ముందుకురావడం లేదు. మాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. దయచేసి మా అమ్మ ఆపరేషన్‑కు సహాయం చేయగలరు’’ అని పేర్కొంటూ ఆ అమ్మాయి ప్రధానికి లేఖ రాసింది.

ఆమె చికిత్స కోసం రూ.30 లక్షలు అవసరం కాగ, తమ దుకాణాన్ని అమ్మాలని ఆ కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ నోట్ల రద్దుతో ఎవరూ దుకాణాన్ని కొనడానికి ముందుకురావడం లేదు. దీంతో ఆ కుటుంబసభ్యులు నిర్మలాగుప్తా చికిత్సకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి దారి కనిపించకపోవడంతో ఆమె కూతురు పూజా గుప్తా, నగదు సహాయం చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖరాసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *