కేన్సర్‌తో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ (60) కన్నుమూశారు. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

ముఖేశ్‌ గౌడ్‌ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 1989, 2004లో మహారాజ్‌గంజ్‌, 2009లో గోషామహల్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో మరోసారి మార్కెటింగ్‌ శాఖ బాధ్యతలను అయిదేళ్లపాటు నిర్వర్తించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *