ఆ పాటకి..15 కోట్ల వ్యూస్..?
తెగుగులో విడుదలయిన ‘ఓకే బంగారం’ సినిమా ఇక్కడ ఎంతటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. అయితే ఇదే సినిమాని రీమేక్ చేసి ‘ఓకే జాను’ గా హిందీలో విడుదల చేశారు. అయితే ఇందులో మాత్రం ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే విషయం కూడా అందరికీ తెలిసందే. అయితే.. ఇందులో ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇందులో ఈ జోడి రొమాన్స్కు, పాటలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ‘హమ్మ హమ్మ’ రీమిక్స్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా డిసెంబర్ 15న ‘హమ్మ హమ్మ’ రీమిక్స్ సాంగ్ను విడుదల చేయగా, అందులో వారిద్దరి రొమాన్స్కు రెహమాన్ మ్యూజిక్ తొడవ్వటంతో ఈ పాట రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
అయితే సినిమా ఎలా ఉన్నాగానీ..ఇందులో ని ఆ పాట మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ వ్యూస్లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ పాటను 15 కోట్ల 33 లక్షల మందికిపైగా చూశారు. అయితే ఈ విషయాన్ని ప్రముఖ సోని మ్యూజిక్ ఇండియా సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది.