సంక్రాంతి సందర్బంగా
సంక్రాంతి సందర్బంగా సోమవారం నుంచి బుధవారం వరకూ హైదరాబాద్లో మూడ్రోజులపాటు అంతర్జాతీయ స్థాయి పతంగులు, జాతీయస్థాయి మిఠాయిల పండుగను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి మొదలుకానున్న 5వ అంతర్జాతీయస్థాయి కైట్ ఫెస్టివల్కు కాంబోడియా, జపాన్, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, కొరియా, శ్రీలంక, ఉక్రెయిన్, టర్కీ, స్విట్జర్లాండ్, యూఎ్సఏ, ఫిలిప్పైన్స్, ఇజ్రాయిల్, సింగపూర్ దేశాల నుంచి 42 మంది మంది కైట్ ఫ్లయర్స్ 200 రకాల పతంగులతో సందడి చేయనున్నారు. అలాగే మన దేశానికి చెందిన 60 మంది క్రీడాకారులు రానున్నారు. ముఖ్యంగా.. సింగపూర్ నుంచి వస్తున్న కైట్ ఫ్లయర్స్ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు రిమోట్ సెన్సింగ్తో పతంగులను ఎగురవేస్తూ ఆకట్టుకోను న్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తోపాటు.. నగర శివారు ప్రాంతాల్లో, ఆగాఖాన్ అకాడమీ ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహిస్తారు.