కేంద్ర బడ్జెట్ లో 50 కి పైగా వస్తువుల ధరలు ….
ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో 50కి పైగా వస్తువుల పై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫర్నీచర్, క్యాండిల్స్,జ్యూవెలరీ, హ్యాండీక్రాఫ్ట్, ల్యాంప్స్, ఇండస్ట్రీయల్ కెమికల్స్, మొబైల్ ఫోన్ చార్జర్స్ తో పాటు మరో 50 కి పైగా వస్తువుల ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. దిగుమతి సుంకాల పెంపు 5 నుంచి 10 శాతం వరకు పెరగవచ్చని సమాచారం. పరిశ్రమలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.