రామ్ చరణ్‌ ని ఇంప్రెస్ చేసిన బుల్లి అభిమాని మృతి

మగధీర చిత్రంలో భైరవ, రణదేవ్ బిల్లా, షేర్ ఖాన్ ఇలా మూడు పాత్రలకి సంబంధించిన డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పి రామ్ చరణ్‌ ని ఇంప్రెస్ చేసిన బుల్లి మగధీర పరశురాం. దాదాపు రెండు సంవత్సరాల క్రితం చెర్రీని కలిసి ఆయన సినిమాలలోని డైలాగ్స్ తో పాటు మహేష్‌, చిరంజీవి, బాలయ్య సినిమా డైలాగ్స్ కూడా చెప్పి చెర్రీకి షాక్ ఇచ్చాడు. చదువుకు దూరంగా ఉంటున్న పరశురామ్ ని ఎలా అయిన చదివించాలని , అతని చదువుకి అయ్యే ఖర్చులు తాను భరిస్తానని రామ్ చరణ్‌ అప్పట్లో మాటిచ్చాడు. అంతే కాదు మంచిగా చదువుకుంటేనే మళ్ళీ కలుస్తానని పరశురాంతో అన్నాడు. కాని బాగా చదువుకొని రామ్ చరణ్‌ ని మళ్ళీ కలిసే లోపే ఆ చిన్నారిని మృత్యువు కామెర్ల రూపంలో కాటేసింది. ప్రస్తుతం పరశురాం కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోగా, చిన్నారిని టీవీలలో చూసి మురిసిన ఎందరో అభిమానులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు. పరశురాం .. రామ్ చరణ్‌ ని కలిసిన టైంలో ఆరెంజ్ చిత్రంలో తాను ధరించిన టీ షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు చెర్రీ. అతనిని ఎత్తుకొని కాసేపు సరదాగా మాట్లాడాడు. మరి ఈ కుర్రాడి మృతిపై చెర్రీ ఏమైన స్పందిస్తాడేమో చూడాలి

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *