తన మొదటి పోస్ట్ తన తల్లికే అంకితం అంటూన్నా రామ్ చరణ్
రామ్చరణ్… ఇటీవలే ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే . ‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు నా మొదటి పోస్టు నీకే అంకితం చేస్తున్నా. లవ్ యూ అమ్మా’ అంటూ తన తల్లి సురేఖ ఒడిలో సేద తీరుతున్న తన చిన్ననాటి, ప్రస్తుత ఫొటోను షేర్ మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశరు. గంటలోపే లక్షకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తన తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకొన్నరు.
రామ్చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా తండ్రి చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.