సిద్ధి వినాయక ఆలయానికి 35 కిలోల పసిడి వర్ణం
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం స్వర్ణ శోభితం అయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు ఆలయం దర్వాజ, తలుపులు, ఫాల్ సీలింగ్, విగ్రహం ఆసనం వెనుక భాగానికి 35 కిలోల బంగారంతో తాపడం చేయించారు. దీంతో, ఆలయం మరింత సరికొత్త శోభను సంతరించుకుంది. పసిడి వర్ణంతో మెరిసిపోతోంది.