ఏ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాల్ చేసిన పది నిమిషాల లోపే
మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్ ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలు చేయాలని సూచించారు. అమల్లో ఉంటే పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఏ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించి విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు. . హెల్ప్ లైన్ హండ్రెడ్ లేదా వన్ ట్వంటీకి కాల్ చేసిన పది నిమిషాల లోపే బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటారని ఆయన తెలిపారు. త్వరలో మహిళా కార్యదర్శులకు కరాటే తో పాటు యోగా క్లాసులు నిర్వహిస్తాం అని డీజీపీ వెల్లడించారు.