మంత్రి దయాకర్రావు, మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు.
ములుగు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. ముందుగా 11గంటల 15 నిమిషాలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే జనరల్బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కలెక్టరేట్లో అందజేయనున్న ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు