ఫేస్బుక్ పై 35,000 కోట్ల జరిమానా
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ కి 35,000 వేల కోట్ల జరిమానా పడనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఫేస్బుక్ ని వాడుతున్న వినియోగదారుల వివరాలకై సంబంధిచిన భద్రత కల్పించడం లో విఫలం అయినందున ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 35,000 వేల కోట్ల (5 బిల్లిన్ డాలర్ల) జరిమానాను విధించింది. ఇంత మొత్తం జరిమానా విధించడం చరిత్రలో ఇదే ప్రథమం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన న్యాయ విభాగం ఇంకా ఆమోదం తెలపలేదట.
ఫేస్బుక్ 2011 లో ఒక సారి ఇదే కేసు ను పరిష్కరించుకుంది. కానీ దాని తరువాత కూడా వినియోగదారుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన భద్రత పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఈ సారి జరిమానా విధించింది. ఇప్పటికైనా ఫేస్బుక్ తన పద్ధతి మార్చుకుంటదో లేదో చూడాలి మరి.