అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా ప్రత్యక్షమయ్యాడు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోలీసులకు వింత జరిగింధి. ఈ ఉదయం కుమారపురం పంటకాల్వలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన కావాడి చిన ఏసుగా బంధువులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా చిన ఏసు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారిగా పోలీసులు, బంధువులు షాకయ్యారు. అసలు చనిపోయిన వ్యక్తి చిన ఏసేనా? మరొకరా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.