దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు పన్నిన కుట్ర
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని కీలక అనుచరుడు చోటా షకీల్ లు వారి గ్యాంగ్ హిందూ నేతలు, రాజకీయ నాయకులు, జడ్జీలను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులు చేసి మత కల్లోలాలు సృష్టించాలని కుట్ర పన్నింది. దావూద్ గ్యాంగ్ పన్నిన కుట్రను ఫోన్ కాల్స్, టెలిగ్రాం, వాట్సప్ మెసేజ్ ల ద్వార వెల్లడైందని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వెల్లడించింది. ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల నేతలను లక్ష్యంగా చేసుకొని చోటా షకీల్ ముఠా దాడులు చేసేందుకు వ్యూహం పన్నిందని ఇంటలిజెన్స్ దర్యాప్తులో వెలుగుచూసింది. హిందూ నేతల హత్యకు దావూద్ గ్యాంగ్ ఆయుధాలను కూడా సమకూర్చుకుందని తేలింది. దావూద్ గ్యాంగ్ పన్నిన కుట్రను ఇంటలిజెన్స్ రట్టు చేయడంతో దీనిపై ఢిల్లీ స్పెషల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.