ఓఎన్జిసి ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం: 5గురు మృతి
నవి ముంబయి లో ఉరన్ ఓఎన్జిసి గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 5గురు మృతి చెందారు. 11 మండి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఇద్దరు అగ్నిమాపక జవాన్లు మరణించారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసికుంది. అగ్ని మాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ పైప్ నుండి మంటలు అందుకున్నాయని ఓఎన్జిసి తెలిపింది. అధికారులు వెంటనే అప్రమత్తమవడంతో ఆయిల్ ప్రాసెసింగ్ పై ప్రభావం పడలేదు. గ్యాస్ ను గుజరాత్ లోని హజీరా ప్లాంట్ కు తరలిస్తున్నారు.