జగపతి బాబుకి కోపం వచ్చింది… లోదా బిల్డర్స్ కి టెన్షన్ ఎక్కువైంది?
నటుడు జగపతి బాబుకి అంత ఈజీగా కోపం రాదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అలాగే మొహమాటం కూడా ఎక్కువని అందరు చెప్పుకుంటారు. అయితే మొదటి సారి జగపతి బాబు ఓ బిల్డర్స్ మీద మండిపడుతున్నారు. వాళ్లకి డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ కుకట్ పల్లి లో లోదా అపార్ట్ మెంట్ బిల్డర్స్ గేటెడ్ కమ్యూనిటీ, హై ఎండ్ అపార్ట్ మెంట్స్ పేరుతో ఒక్కో వ్యక్తి దగ్గర 4 కోట్లు వసూలు చేసింది. అలా కట్టిన వాళ్ళలో జగపతి బాబు కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడు ఆ బిల్డర్స్ ఇప్పుడు పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ తో గేటెడ్ కమ్యూనిటీకి లింక్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ముందు ఒక మాట చెప్పి, ఇప్పుడు వేరే విధంగా వారికి నచ్చినట్లు ప్లన్స్ మార్చేసి. కస్టమర్స్ ని మోసం చేస్తున్నారని విమర్శించారు. 7వేల మంది నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీ తో అపార్ట్మెంట్స్ ని కలపడం వలన ఎవరికీ రక్షణ ఉందదని. అందుకే అక్కడున్న అందరు వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని జగపతి బాబు అన్నట్లు సమాచారం. ప్రశాంతత కోసం తాము గేటెడ్ కమ్యూనిటీకి వచ్చామని అయితే అపార్ట్మెంట్స్ తో కలపడం వలన తమకి ప్రశాంతత ఉండదని అక్కడ ఉన్న అందరు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. బిల్డర్స్ తమ ఆలోచనని విరమించుకోవాలని, కాదని మొండికేస్తే ఎం చేయాలో, ఎలా వెళ్ళాలో తమకు భాగా తెలుసనీ లోదా బిల్డర్స్ కి వార్నింగ్ ఇచ్చారు.