సైరా లో నయనతార పారితోషికం ఎంత?
లేడి ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న సౌత్ స్టార్ నయనతార. ఇప్పుడు ఈమె కథానాయికగా నటించిన సైరా చిత్రానికి భారీ పారితోషికం తీసుకున్నట్టు వార్తా ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. విషయానికి వస్తే మెగాస్టార్ నటించిన చరిత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డికి నయనతారకు ఏకంగా రూ.6.5 కోట్లు పారితోషికంగా ఇచ్చారట. దీంతో దేశం లోని అత్యధిక పారితోషిక అందుకుంటున్న నటుల సరసన నయనతార కూడా చేరింది.
సైరా నరసింహ రెడ్డి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.