పేటిఏం: రోజుకు రూ.11కోట్ల నష్టం…
ఆన్ లైన్ పేమెంట్స్ సంస్థ పేటియమ్ కు నష్టాలు పెరిగాయి. గూగుల్ పే, ఫోనే పే లాంటి పేమెంట్స్ సంస్థల నుండి పోటీ రావడంతో గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చూసింది. సగటున రోజుకు రూ. 11 కోట్ల చొప్పున నష్టపోతుంది. పేటిఎమ్ మాతృక సంస్థ వన్97 కమ్యూనికేషన్ తాజాగా కంపెనీ వార్షిక ఫలితాలను వాటాదారులతో పంచుకుంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఏకంగా రూ. 4,217 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందుతో పోల్చితే ఇది 162 శాతం ఎక్కువ. అయితే ఆదాయం మాత్రం పెరిగింది. ప్రస్తుత పరిస్తితుల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో బ్రాండ్ విలువను పెంచుకునేందుకు ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కంపెనీ పేర్కొంది.