ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం నేడు విచారణ
జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వల్ల దఖ్లైన పిటిషన్లపై సుప్రీం కోర్ట్ నేడు విచారణ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలావగా వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. అక్టోబరు మొదటివారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనాయంత్రాంగానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.