సుష్మా స్వరాజ్ ఇకలేరు, గుండె పోటుతో మృతి
సుష్మా స్వరాజ్ ఇకలేరు, గుండె పోటుతో మృతి
ఢిల్లీ: మాజి విదేశాంగ మంత్రి, బిజెపి సీనియర్ నేత శ్రీమతి సుష్మా స్వరాజ్ గుండె పోటు తో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆరోగ్యం క్షీణించడంతో సుష్మా స్వరాజ్ ను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్టికల్ 370 రద్దు పై చివరి ట్వీట్ చేసిన సుష్మా స్వరాజ్ “ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు, నా జీవితంలో ఈ రోజు కై ఎదురు చూస్తున్నాను” అని తన ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు.
సుష్మా స్వరాజ్ కి 2016 లో కిడ్నీ మార్పిడి జరిగింది, అప్పటినుంచి ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చింది, అందుకే 2019 ఎలెక్షన్ల లో పోటీకి దూరంగా ఉన్నారు. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాన్సురి తనతో పాటు ఉన్నారు.
దేశం ఒక ఉత్తమ నేతను కోల్పోయింది, సుష్మా స్వరాజ్ తన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేశారు, సుష్మా స్వరాజ్ ఏంతో మందికి ప్రేరణగా నిలుస్తారు అని వరుస ట్వీట్లతో తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.