టీజర్ : సైరా నరసింహారెడ్డి
మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ రానే వచ్చింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని సైరా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సురేందర్ రెడ్డి ఒక అద్భుతమైన పీరియడ్ డ్రామాగా, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా తెరకెక్కిస్తున్నారని తేలిపోయింది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రూ. 150 కోట్ల పై చిలుకు బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది.
మెగాస్టార్ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మేజర్పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నయనతార, చిరు సరసన హీరోయిన్గా నటిస్తుండగా తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ భారీ చారిత్రక చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు.