స్పీకర్కు రేవంత్ హెచ్చరిక, చీఫ్ మార్షల్పై భగ్గు
హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యులు మాట్లాడక ముందే సస్పెన్షన్ చేయడం ఏమిటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాగే చేస్తే తాము స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా వెనుకాడమని చెప్పారు.
టిడిపి సభ్యులు సభ నుంచి వెళ్లలేదు. దీంతో మార్షల్స్ను రప్పించారు. వారు టిడిపి ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చీఫ్ మార్షల్ పైన రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి సభలో అన్నారు. స్పీకర్ మధుసూదనా చారి మాట్లాడుతూ.. తాను చైర్లో కూర్చేక ముందే ఆందోళనలా అని మండిపడ్డారు.