బిగ్ బాస్ తెలుగు 9వ ఎపిసోడ్ రియాక్షన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తొమ్మిదవ ఎపిసోడ్ తో తమన్నా సింహాద్రి (హిజ్రా) బిగ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది, వచ్చి రాగానే.. జాఫర్ తో మాట్లాడుతూ.. తానూ.. బాబా భాస్కర్ మరియు జాఫర్ లతో కలిసి పోతానని ఒకే జట్టుగా మెదులుతానని చెప్పుకొచ్చింది, అలాగే.. మహేష్ విట్టా వరుణ్ సందేశ్, వితికల మధ్య జరిగిన గొడవలో.. మహేష్,వరుణ్ కి సారీ చెప్పటం తనకు నచ్చలేదని, హౌస్ లోకి రాగానే.. వరుణ్ సంగతేంటో చూద్దామనుకున్నానని అలి రాజాతో ముచ్చటించింది, తదుపరి రెండో వారం ఎలిమేనేట్ అయ్యే సభ్యులకోసం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్, ఇందులో.. 5 ఓట్లతో శ్రీముఖీ,హిమజాలు మొదటి ఎలిమినేషన్ స్ధానంలోకి చేరారు, కాగా 3 ఓట్లతో మహేష్ విట్టా.. వరుణ్ సందేశ్, వితిక, జాఫర్లు రెండో స్ధానంలో ఉండగా.. 2 ఓట్లతో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ లు చివరి స్ధానంలో నిలిచారు, అయితే… బాబా భాస్కర్ ఎవరినీ నామినేట్ చేయటం తనకు ఇష్టం లేదని చెప్పటంతో.. అలా కుదరదని, ఇద్దరి పేర్లు చెప్పాల్సిందేనని, లేదంటే.. హౌస్ లో ఉన్న పదిహేను మంది నామినేట్ అవుతారని చెప్పటంతో మళ్ళీ బాబా భాస్కర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్ మరియు వితికాలను నామినేట్ చేసాడు. కాగా ఈ వారం మొత్తం 8 మంది (శ్రీముఖి, హిమజ, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, రాహుల్ సిప్లిగంజ్, జాఫర్, మరియు పునర్నవి) ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *