బీజేపీ బంపర్ ఆఫర్…గవర్నర్ గా ప్రొఫెసర్ కోదండరాం..?
తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించిన ప్రొఫెసర్ కోదండరాం కు కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్నిఎలాగైనా గద్దె దించి 2019 ఎన్నికల్లో హవా కొనసాగించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. అందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షా కోదండరాంకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట.
రాష్ట్ర సాధనలో ఎంతో కృషి చేసిన కోదండ రాంకు గవర్నర్ పదవి ఇస్తామని కేంద్ర బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హామి ఇచ్చారట. అయితే ఈ ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తనను గుర్తించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేసినట్టు సమాచారం.