వేణుమాధవ్ భౌతికకాయానికి పలువురు నివాళులు
బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేణు మాధవ్ పెద్ద కుమారుడు ప్రభాకర్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నాడు.