పద్మ భూషణ్ అవార్డుకు పీవీ సింధు పేరు సిఫార్సు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేరును పద్మ భూషణ్ అవార్డుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్లో సింధు రజతంతో మెరిసింది. ఇండియా ఓపెన్ 2017లో స్వర్ణం, కొరియా ఓపెన్ 2017లో స్వర్ణం, చైనా ఓపెన్ 2016లో స్వర్ణం, రియో ఒలింపిక్స్ 2016లో రజతం, దక్షిణాసియా క్రీడలు 2016లో కాంస్యం సాధించింది సింధు. 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు సింధును వరించాయి.