బ్లాక్ మనీకి బాస్ అంబానీయేనట…

మన దేశ కుభేరుడు రిలయన్స్ చైర్మన్ ముకేశ్‌ అంబానీకు షాక్ తగిలింది. తాజా నివేదికల ప్రకారం అంబానీ భార్య నీతా అంబానీ, వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. 2019 మార్చి 28న ఈ నోటీసులు జారీ చేసింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలకు అనేక దేశాల్లో వున్న విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం.

విషయానికి వస్తే ఆదాయపు పన్ను శాఖ వ్యాపారవేత్తలపై 2011లో దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్‌ఎస్‌బీసీ జెనీవా కూడా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. అయితే 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌ తో 14 హెచ్‌ఎస్‌బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌ ను ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ నివేదించింది.  అయితే ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో సంబంధముందని తెలిపింది. దీనితో ముంబాయిలోని అదనపు ఆదాయ కమిషనర్‌ ద్వారా బ్లాక్ మనీ సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ), టాక్స్ యాక్ట్ 2015 ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన  రిలయన్స్ ప్రతినిధి ఈ నివేదికలను పూర్తిగా ఖండించి తమకేమి ఐటీ శాఖ నోటీసులేవీ అందలేదని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *