రోడ్డు ప్రమాదంలో గాయపడితే…..
రోడ్డు ప్రమాదంలో గాయపడితే…
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడితే వారికి సర్కారు అండగా నిలవనుంది.! క్షతగాత్రులైన వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స, గాయపడ్డ మొదటి మూడు రోజులు ఉచితంగా చికిత్స అందిస్తారు, ప్రతి ఆస్పత్రిలో క్యాజువాలిటీ తరహాలో ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ‘తెలంగాణ స్టేట్ యాక్సిడెంట్, ఎమర్జెన్సీ కేర్ ఇనీషియేటివ్-టీఏఈఐ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలను కుంటున్నారని, ఆర్ అండ్ బీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, జాతీయ రహదారుల సంస్థల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఈ విధానం తమిళనాడులో అమలవుతోందని ఇలాగే తెలంగాణలోనూ ఉచితంగా వైద్య సేవలందించాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన నిధులను కొత్త వాహనాల రిజిష్ట్రేషన్ సమయంలోనే సెస్ లేదా ట్యాక్స్ విధించాలని ప్రతిపాదన అయితే, ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, ఇంకా ఖరారు కాలేదని అన్నారు. ఈ పథకం కనుక అందుబాటులోకి వస్తే బాధితులకు ఎంతో మేలు కలిగినట్లవుతుంది.