తల్లి, నలుగురు కూతుళ్ళు శవాలై…

మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ, తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలగా సోమవారం ఉదయం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఈ సంఘటన జరిగిందని భావిస్తుండగా, తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా వారిని చంపి బావిలో పడేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *