తల్లితో గొడవపడిందని టీచర్ ను చంపేసిన చిన్నారి

12 ఏళ్ల విద్యార్ధి దారుణానికి పాల్పడ్డాడు. తన ల్లితో గొడవ పడిందనే కారణంతో ఏకంగా తన ట్యూషన్ టీచర్‌నే చంపేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం గోవండీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అయేషా అస్లాం హుసుయే (30) అనే మహిళ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ జీవిస్తోంది. ఎప్పటిలాగానే ఆమె ముంబయి సబర్బన్‌ లోని ఓ విద్యార్థికి ట్యూషన్ చెప్పేందుకు వెళ్లింది. విద్యార్థి తల్లి కొంత డబ్బు కావాలని అయేషాను అడిగింది. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యార్థి ఎదురుగానే వారిద్దరూ గొడవ పడ్డారు. దీంతో ఆ విద్యార్థి వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి అయేషా కడుపులో పొడిచాడు. దీంతో విద్యార్థి తల్లి షాకైంది. స్థానికుల సాయంతో అయేషాను హాస్పిటల్‌కు తరలించింది. అయితే, ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *