5 నుండి జియో ఫైబర్ సేవలు
సోమవారం జరిగిన రిలయన్స్ 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 5 నాటికి జియోకు మూడేళ్లు పుర్తి అవుతాయి, అదే రోజున జియో ఫైబర్ సేవలను కమర్షియల్ బేసిస్లో ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలకు, 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. తర్వాత జియో ఫైబర్ ఫీచర్లను ఇషా, ఆకాశ్ అంబానీ వివరించారు. ఇక నెలకు రూ 500తో ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ అత్యధికంగా రూ 67,000 కోట్ల జీఎస్టీ చెల్లించిందని ముఖేష్ అంబానీ తెలిపారు.