నాగార్జున సాగర్..గేట్ల ఎత్తివేత
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. పై నుండి భారీగా వస్తున్న వరదతో నాగార్జున సాగర్ లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇవాళ రాత్రికే దిగువనున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంటోంది. ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్లోకి వదిలారు. దీంతో అధికారులు సాగర్ 24 గేట్లను పైకెత్తారు. ఒక్కో గేటును 5 అడుగుల వరకు పెకెత్తి 65,105 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 225 టీఎంసీలు నమోదైంది. దీంతో సాగర్ పరివాహాక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.