నిజామాబాద్ : కలెక్టర్ పిల్లలతో కలిసి
నిజామాబాద్ : కలెక్టర్ నారాయణరెడ్డి విద్యార్థిగా మారారు. ఆదివారం న్యాలకల్ రోడ్డులోని సమీకృత షెడ్యూల్డ్ కులాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదుపాయాలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కలిసి నేలపై కూర్చుని అల్పాహారం తీసుకున్నారు. వసతిగృహ నిర్వహణ విషయంలో సంక్షేమాధికారిపై అసహనం వ్యక్తం చేశారు.విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.