ఎంపీ కవితపై సెహ్వాగ్ ప్రశంసలు
ఎంపీ కవితపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. రాఖీ పండుగకు హెల్మెట్ కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ చేంజ్ అన్న ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిన్న పార్లమెంట్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఎంపీ కవిత చేపట్టిన కార్యక్రమం ఓ మంచి ప్రయత్నమని సెహ్వాగ్ అన్నాడు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఓవర్స్పీడ్తో వెళ్లడమంటే పాస్పోర్ట్ లేకుండానే శ్మశాన వాటికకు వెళ్లడం అని సెహ్వాగ్ తన ట్విట్టర్లో తెలిపాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరపడ వద్దు అని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మీరు అభిమానించే వ్యక్తులకు హెల్మెట్ను గిఫ్ట్గా ఇవ్వాలని సెహ్వాగ్ సూచించాడు.
Good initiative. Driving helmetless & overspeeding is passport to grave. Please don’t be in a hurry. Be safe & gift your loved ones a helmet https://twitter.com/RaoKavitha/status/889518452884373504