చైనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనపై విరుచుకుపడ్డారు. చైనా తన వినాశనన్ని తానే స్వయంగా కొనితెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మరోదశ టారిఫ్ లు అమల్లోకి రానుండటంతో 13శాతం కంపెనీలు చైనా నుండి వెళ్లిపోయెందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇది చాలా పెద్ద విషయం, దీనికి నేను ఆశ్చర్యపోవడం లేదు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. వారు టారిఫ్ లను తట్టుకోలేరు. మేము టారిఫ్ లు విధించి బిలియన్ల కొద్ది ఆదాయాన్ని పొందుతున్నాం. వారు కరెన్సీ విలువను బాగా తగ్గించుకున్నారు. చివరకు అదే వారికి దెబ్బతిస్తుంది. ఈ సంవత్సరం వారికి నష్టం భారీగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు చైనాకి ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నా అని అన్నారు.