బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ
మొదటిసారిగా ఓ మహిళా బిగ్బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది. బుల్లి తెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్-3 వ్యాఖ్యాతగా నటి రమ్యకృష్ణ ఓ వారం అతిధిగా రాబోతున్నారు. నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్ను ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. దీంతో ఈ వీకెండ్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజు దూరంగా ఉన్నప్పుడు.. రాణి వచ్చిందంటూ రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.