భారత్ కి షాక్… మాట మార్చిన ట్రంప్
ఒకపక్క అమెరికాలో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుట్యూన్ ఉంది. మరోపక్క మోదీకి హోస్టన్ సభ ముగిసిన రెండోరోజేమాట మార్చారు. భారత్-అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు కలిసి పనిచేస్తామని హోస్టన్లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే తన మాట మార్చారు. భారత్తో పాటు .. ప్రధాని మోదీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం మోదీతో పాటు హోస్టన్ సభలో పాల్గొన్న ట్రంప్… ఆ మరుసటి రోజు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ నోట మళ్లీ కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. భారత్, పాక్లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొన్న మరుసటి రోజే భారతీయులంతా అవాక్కయ్యేలా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.