ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కవిత
ఎంపీ కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని ఇవాళ కలిశారు. ప్రధాని ని కలిసిన ఎంపీ కవిత ఈ సందర్భంగా రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుపై పలువురు ముఖ్యమంత్రులు రాసిన లేఖలను ప్రధానికి కవిత అందజేశారు. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు.
పది నెలల పాటు సాగు చేసే పసుపు పంటలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని మోడీకి ఎంపీ కవిత వివరించారు. విత్తనాల దగ్గర నుంచి దిగుబడి, మద్ధతు ధర వరకు వారికి ఏ సహాయం లేదని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తప్ప ప్రీ-హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ సహాయం అందేలా లేదని స్పష్టం చేశారు. దేశంలో 13 రాష్ట్రాల్లో పసుపు సాగవుతున్నందని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందన్నారు. సాగు, ప్రాసెసింగ్, మద్ధతు ధర విషయాల్లో పసుపు బోర్డు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని.. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని కవిత ప్రధాని మోడీని కోరారు.