కుల్దిప్, చహల్ దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరం
వరల్డ్ టీ20కి ఇప్పుడీ నుండే టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. రాబోవు సిరీస్ల్లో యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో కీలక ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్.. తాజాగా కుల్దీప్, చహల్ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.
ఆస్ట్రేలియాలో జరుగున్న టీ20 వరల్డ్ కప్ నాటికి యువ క్రికెటర్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్, చహల్లు పొట్టి ఫార్మాట్లో అసాధారణమైన బౌలర్లు. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కానీ మాకున్న మిగతా బౌలింగ్ ఆప్షన్స్ పరీక్షించాలనుకుంటున్నాం.ఫాస్ట్ బౌలర్ నవదీప్, శ్రేయస్ అయ్యర్లు వారి సత్తాను నిరూపించుకున్నారు. ఇక కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్లు కూడా పొట్టి ఫార్మాట్లో వారి ప్రతిభను చాటుకున్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కుల్దీప్, చహల్లను పక్కకు పెట్టాం’ అని ఎంఎస్కే పేర్కొన్నాడు.