దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంభించిన రామ్ చరణ్
దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా.. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో దేశంలో అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చెన్నై- కోల్కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెంలో రూ.40 కోట్లతో సరికొత్త హంగులతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. ఈ థియేటర్లో ఈనెల 30న సాహో సినిమా విడుదల కానుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్ సిస్టమ్తో థియేటర్ను నిర్మించారు.