మోడీకి ఆర్ఎస్ఎస్ షాక్..!
పెద్ద నోట్ల రద్దుతో విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ షాకిచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ నేత గోవిందా చార్య పెద్ద నోట్ల రద్దుపై రాసిన లేఖ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కు రాసిన లేఖలో గోవిందాచార్య పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సంభవించిన 40 మంది మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ లేఖలో గోవిందా చార్య డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు మూడు రోజుల్లోగా నష్ట పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దుపై ముందస్తు ప్రణాళిక లేకుండా సామాన్యులను ఇబ్బందుల పాల్చేశారని గోవిందాచార్య ఆ లేఖలో ఘాటుగా విమర్శించారు.