‘ఏ చోట నువ్వున్నా’ అంటున్న సాహో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రా యూనిట్ తాజాగా ఏ చోట నువ్వున్నా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభాస్ డార్లింగ్ లుక్లో ఆకట్టుకుంటున్నాడు. అందమైన లోకేషన్స్లో చిత్రీకరించిన ఈ పాటకు గురు రణ్ధవ సంగీతమందించగా కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్లు ఆలపించారు.
అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.