సాయి ప్రణీత్ కొత్త రికార్డ్
భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్లో సెమీ ఫైనల్కు చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-12, 21-15 తేడాతో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి సెమీస్ కి చేరాడు. ఈ ఫలితంగా జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో సెమీస్కు చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. తొలి గేమ్ను సునాయాసంగా గెలిచిన సాయి ప్రణీత్.. రెండో గేమ్లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఓ దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్ ఎక్కడ తగ్గకుండా గేమ్తో పాటు మ్యాచ్ను కూడా కైవసం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే సుగియార్తోను మట్టికరిపించి సెమీ ఫైనల్ కి చేరాడు సాయి ప్రణీత్.