సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది
జపాన్ ఓపెన్ వరల్డ్టూర్-750 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్లో భాగంగా సెమీ ఫైనల్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ 18-21, 12-21 తేడాతో జపాన్ క్రీడాకారుడు కెంటో మొమోటో చేతిలో పరాజయం చెందడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. తొలి గేమ్లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. మొమోటో వరుస ఆరు పాయింట్లు సాధించి సాయి ప్రణీత్పై తిరుగులేని ఆధిక్యం సాధించాడు. దాంతో పుంజుకోలేక పోయిన సాయి ప్రణీత్ గేమ్తో పాటు మ్యాచ్ను కూడా చేజార్చుకున్నాడు.